Home » Rajendranagar
హైదరాబాద్లోని పురాతనమైన బంరుకున్దౌల చెరువులోని ఆక్రమణలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఉక్కుపాదం మోపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస జోరు కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేరనున్నారు. ఆయనతోపాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ జరిగిన కేసును ఛేదించినట్లు రాజేంద్రనగర్(Rajendranagar) డీసీపీ శ్రీనివాస్(DCP Srinivas) వెల్లడించారు. ఈనెల 9న బాధితుడు కుటుంబంతో సహా వ్యక్తిగత పని నిమిత్తం విజయవాడకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు 24గంటల్లోనే కేసు ఛేదించి సొత్తును బాధితులకు అప్పగించారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై కారు రేసింగ్ జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చిన థార్ కారు పల్టీలు కొట్టింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ను ఢికొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
హరి తహారం కార్యక్రమంలో బండ్లగూడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ (కాంగ్రెస్), మాజీ మేయర్ (బీఆర్ఎస్) వర్గీయులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ సమక్షంలోనే గొడవపడి కొట్టుకు న్నారు.
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కు సీఎం ఎ.రేవంత్రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనం కీలకమని, జయశంకర్ వర్సిటీ నాణ్యమైన, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండటం హర్షణీయమని అభినందించారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్, నార్సింగీ, సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా నైజీరియన్స్ నివశించే ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న నైజీరియన్ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హరిని అనే బాలిక ఇంటర్ మొదటి సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెంది గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో విద్యార్థిని నిర్ణయం తీసుకుంది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.