• Home » Rajanna Sircilla

Rajanna Sircilla

CM Revanth Reddy: వేములవాడ ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోండి

CM Revanth Reddy: వేములవాడ ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోండి

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని అధికారులు, అర్చకుల్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Vemulawada: రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం.. ఎప్పటినుంచి అంటే..?

Vemulawada: రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం.. ఎప్పటినుంచి అంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. ఇక్కడ శివుడు.. రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ పరమశివుడిని దర్శించుకొని తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (YTADA) కీలక నిర్ణయం తీసుకుంది.

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్‌ దర్శనం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

Sircilla: వేములవాడ రాజన్నకు రూ.35 లక్షల విరాళం

Sircilla: వేములవాడ రాజన్నకు రూ.35 లక్షల విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు గురువారం రూ.35 లక్షల విరాళం అందజేసి మంచి మనసు చాటుకున్నారు.

Hyderabad: మళ్లీ కోతలు ..

Hyderabad: మళ్లీ కోతలు ..

రాష్ట్రంలో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే ప్రతీ వంద డెలివరీల్లో 75 సిజేరియన్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో 46.4 శాతం కడుపుకోతలే ఉండటం గమనార్హం.

Siricilla: కన్నకూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు..

Siricilla: కన్నకూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు..

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.

Lok Sabha Election 2024: కేసీఆర్‌కు నిరసన సెగ.. మిడ్ మానేరు నిర్వాసితుల ఆందోళన

Lok Sabha Election 2024: కేసీఆర్‌కు నిరసన సెగ.. మిడ్ మానేరు నిర్వాసితుల ఆందోళన

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా కేసీఆర్‌కి మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది.

Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు

Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు

ఓట్లు కోసం శ్రీరాముడి పేరు వాడుకోవడం లేదని కరీంనగర్ ఎంపీ ఒండి సంజయ్ స్పష్టం చేశారు. భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్ వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని ఆయన అభివర్ణించారు. ఆదివారం రాజన్న సిరిసిల్లలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం బీజేపీ పోరాడితే.. కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తారా ? అని ప్రశ్నించారు.

Vemulawada: రాజన్న ఆలయంలో మరికాసేపట్లో సీతారాముల కల్యాణం

Vemulawada: రాజన్న ఆలయంలో మరికాసేపట్లో సీతారాముల కల్యాణం

వేములవాడ రాజన్న సన్నిధిలో నేడు శ్రీ సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.

Vemulavada: రాజన్న క్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు

Vemulavada: రాజన్న క్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు

రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న క్షేత్రంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి