Home » Rajamahendravaram
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలోని ప్రభుత్వ పథకాల పేరు మార్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. భావితరాలకు ఆదర్శనీయులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయమని కొనియాడారు.
నైజీరియా డ్రగ్స్ దందా ప్రధాన నగరాలకే కాకుండా.. చిన్న నగరాలకు కూడా విస్తరించిందని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు గుర్తించారు. ఇటీవల టీజీ న్యాబ్, సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నైజీరియన్ గ్యాంగ్కు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు.
పొగాకు(Tobacco) అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశపు పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeswari) తెలిపారు. ఈ సందర్భంగా పరిమితి మించి పండించిన పొగాకుపై పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరినట్లు ఆమె వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటిసారిగా బీజేపీ (BJP) విస్త్రతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్(Samanchi Srinivas) తెలిపారు. రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో జులై 8న ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు.
భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన అంశాలతో ‘శ్రీ లలితా విష్ణు’ అంశాలు ప్రధాన భూమికలుగా చేసుకుని ఈ ఏటి బోనాల పర్వాల వేళ ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించడానికి ముఖ్య అతిధి స్థానంలో విచ్చేసే ప్రభుత్వ, రాజకీయ, సినీరంగాల భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమృతశక్తుల అపురూప రచనాసంకలనాన్ని ఉచితంగా సమర్పించడం మహంకాళి తల్లి అనుగ్రహ విశేషమేనని సికింద్రాబాద్ ఉజ్జయిని మహాహాకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ పేర్కొన్నారు.
సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.
‘వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయించాలి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి’ అని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు.
మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధంమైంది. రాజమహేంద్రవరం వీఎల్ పురంలో గల మార్గాన్ని ఎస్టేట్స్ ఆఫీసులో ప్రచార రథం ఉంది. శుక్రవారం (నిన్న) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రచార రథానికి నిప్పు పెట్టారు. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్కు సమాచారం ఇచ్చారు.
ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.