Home » Rajamahendravaram
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు( Lala Cheruvu )లో చిరుతపులి( Leopard ) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో రెండు రోజులుగా చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. పులి కదలికలపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
లాలాచెరువు(Lala Cheruvu)లో చిరుతపులి(Leopard) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు స్థానికులను కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నాయి.
ఆమె వయసు 30.. చోరీ కేసులు 34.. ఇప్పటికే 10 సార్లు జైలుకెళ్లి వచ్చింది.. అయినా మార్పు రాలేదు.. చోరీలు కొనసాగిస్తోంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధులే టార్గెట్...! వారిని మచ్చిక చేసుకుని దగ్గరవుతుంది.
పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఓ చెట్టు ఉంది. దాంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ చెట్టుకు ఓ పేరు ఉంది. అదే సినీ వృక్షం, వయస్సు 150సంవత్సరాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది, ఆ చెట్టు ఎందుకంత ప్రత్యేకమో.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలోని ప్రభుత్వ పథకాల పేరు మార్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. భావితరాలకు ఆదర్శనీయులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయమని కొనియాడారు.
నైజీరియా డ్రగ్స్ దందా ప్రధాన నగరాలకే కాకుండా.. చిన్న నగరాలకు కూడా విస్తరించిందని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు గుర్తించారు. ఇటీవల టీజీ న్యాబ్, సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నైజీరియన్ గ్యాంగ్కు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు.
పొగాకు(Tobacco) అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశపు పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeswari) తెలిపారు. ఈ సందర్భంగా పరిమితి మించి పండించిన పొగాకుపై పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరినట్లు ఆమె వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటిసారిగా బీజేపీ (BJP) విస్త్రతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్(Samanchi Srinivas) తెలిపారు. రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో జులై 8న ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు.