Home » Rail Tickets
ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) మంగళవారం ఒక తీపికబురు చెప్పింది. ఎక్స్ప్రెస్ స్పెషల్గా (Express Special) మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని (Passenger Trains) సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పునరుద్ధరించింది. ఈ అంశంపై సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించి, పాత రేటుకే సెకండ్ క్లాస్ ఆర్డినరీ టిక్కెట్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.