Home » Raghurama krishnam raju
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా జైల్లో న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రఘురామ గుంటూరు జైలుకు వస్తున్నారు.
YS Jagan Case: జగన్ బెయిల్ రద్దు, కేసుల బదిలీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది. సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున విచారణను వాయిదాకు సీబీఐ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Andhrapradesh: రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అనుమతించింది.
AP Highcourt: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో చుక్కుదురైంది. ప్రభావతి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి.
రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని కొంత సమయం కావాలని 7, 8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు.
కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్కు ఆయన లేఖ రాశారు.
రంగంపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాల్లో, గ్రామీణ సంస్కృతిలో భాగమని, ఇవి లేకపోతే నాణ్యమైన పశుపక్ష్యాదుల సంపద అంతరించిపోతుందని, చట్టాన్ని అతిక్రమించకుండా ఇలాంటి పందేలను ఆదరించి పోషించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మం డలం వడిశలేరు గ్రామం వద్ద గన్ని సత్యనారాయణమూర్తి స్మారక 6వ వార్షిక రాష్ట్రస్థా
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.