Home » Raghu Rama Krishnam Raju
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శనివారం సమావేశం అవబోతున్నారు. పెండింగ్ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సీఎంల భేటీ అభినందనీయం అంటున్నారు ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు. అదే సమయంలో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయి నిధులు వస్తే బాగుంటుందని వివరించారు.
ఏపీవ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు.
మాజీ సీఎం జగన్ గురించి ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నారని.. ఆయనకు అంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల్లో తెలిసిపోయిందని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణం రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) వ్యంగ్యస్త్రాలు గుప్పించారు.
ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లగొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో.. రాష్ట్రం నుంచి జగన్ను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఖాజానా మొత్తం ఖాళీ అయ్యిందని పేర్కొన్నారు.
Andhra Pradesh News: వైసీపీ నేతలపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్కు రఘురామకృష్ణం రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమను కొట్టారని విజయసాయి రెడ్డి ఢిల్లీలో హంగామా చేశారని..
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.
రాష్ట్రంలో ఇటివల ఎన్నికలు పూర్తి కాగా, అందరూ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు అనేక రకాల రిపోర్టులను వెల్లడించాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో తప్పకుండా ప్రమాణస్వీకారం చేస్తారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు సీఎం జగన్, పాల్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: 125 నుంచి 150 స్థానాల్లో కూటమి గెలుస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు.
ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉండి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మీరు చూస్తారన్నారు. మూడు పార్టీలు ఇక్కడ.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో అని.. ఒక విధ్వంసకారుడని పేర్కొన్నారు.