Home » Purandeswari
కడియం మండలం బుర్రిలంకలో ఇసుక మాఫియాను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు జనసేనతో కలిసి ర్యాంపును పరిశీలించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై మేము మాట్లాడితే మాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. రుజువులతో మేము మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదన్నారు. జేపీ కంపెనీకి అనుమతి పూర్తయిందని పురందేశ్వరి అన్నారు. రూ.48 కోట్లకు ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
గుంటూరు: కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేస్తోందని.. సీఎం జగన్ అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడంలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏం అర్హత ఉందని సాయి రెడ్డి పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేస్తున్నారని, విజయసాయి రెడ్డి ఒక నటోరియస్ క్రిమినల్ అంటూ సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు శివారులో జగన్నాధగట్టుపై ఐఐఐటీడీఎమ్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్కు కనిపించడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.
అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు.
రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్లో బస్సు ప్రమాదం ఆందోళనకు గురి చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు.
బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తన బెయిల్ రద్దు చెయ్యాలని చెప్పడంలో అర్థం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పురంధేశ్వరి ఆలోచనా విధానంలో పొరపాటు ఉందన్నారు. రిఫామ్స్ తీసుకువచ్చి త్వరితగతిన కేసులు పరిష్కరించాలన్నది బీజేపీ చేతుల్లోనే ఉందన్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎంపీ విజయసాయి రెడ్డికి లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు.
ఏపీ సీఎం జగన్ మద్యం కుంభకోణంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. హై కోర్టులో పిల్ దాఖలు చేయాలని ఏపీ బీజేపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ నేతలు పిల్ను సిద్ధం చేస్తున్నారు. జగన్ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు పురందేశ్వరి లేఖ రాశారు.