Home » Puranapanda Srinivas
ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.
తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళ్లే మొట్టమొదటి దారిలో ఉన్న వినాయకుడి గుడి వద్ద మంగళవారం విఘ్నేశ్వరుని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఆ ఆలయ అర్చక పండితునికి తన ప్రత్యేక పవిత్ర మహాగ్రన్ధమ్ ‘నేనున్నాను’ అందించి మంగళాశీర్వచనం పొందారు. అనంతరం తిరుమల గోశాలనీ దర్శించుకుని... అక్కడి సిబ్బందితో గోవులతో ఉంటే ఉండే ఆరోగ్యం, ఆనందం గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తదుపరి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన శ్రీ రంగనాథమంటపంలో వేదపండితుల ప్రత్యేక ఆశీర్వచనం, శేషవస్త్రం పొందారు.
అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని ... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే ... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం.ప్రశంసనీయం.
బళ్లారి శ్రీ అమృతేశ్వర ఆలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.., నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు సందర్భోచితంగా భక్తి స్వాగతం పలుకుతూ పురాణపండ శ్రీనివాస్ అమృతలేఖిని నుంచి జాలువారిన రెండు అమోఘ గ్రంధాలను సాయి కొర్రపాటి మహా శివరాత్రి నుండి బళ్ళారి ఆలయానికి విచ్చేస్తున్న వేల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఆనందం కలిగిస్తోంది.
‘హరే హరే’, ‘హరోం హర’ రెండు పవిత్ర గ్రంధాలు కేసీఆర్కి సంతోష అద్భుత ఆశ్చర్యానుభూతుల్ని పంచడం కోసమే పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా రచయిత పురాణపండ శ్రీనివాస్తో సమావేశమై ఎంతో ఎంతో భక్తి రసాత్మకంగా రూపొందించారని పొన్నాల వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు.
కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండువారాల ముందు తన స్వగృహానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ని ఆహ్వానించి, తన గృహంలోని కార్యాలయంలో గంటకు పైగా చర్చలు జరిపి, సత్కరించి ఈ అద్భుతమైన ‘శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని ప్రచురించి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు రోజా.
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రాజకీయ ‘జయోస్తు’ పలకడం కోసం పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ పురాణపండ శ్రీనివాస్ చేత అపురూపమైన అద్భుత మహా నారసింహ స్వామి వారి ప్రత్యేక గ్రంధాన్ని రచింపజేయడానికి పురాణపండకు కబురు పెట్టినట్లుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో వినబడుతోంది.
కొన్ని అనుభూతులు అనిర్వచనీయ అనుభూతులుగా కమ్ముకున్నప్పుడు.. జీవితకాలమంతటా ఆ పవిత్ర జ్ఞాపకాలు వెన్నంటి వుంటాయనడానికి ఇలాంటి అద్భుతాల్ని అప్పుడప్పుడు మనస్సు ముందు నివేదించుకోవాలంటారు ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ మాసపత్రిక పూర్వ గౌరవ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తానున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతుల చిత్రాలతో ఒక విలువైన గ్రంధాన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలకు, నృసింహ క్షేత్రాలకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రధాన నాయికా నాయకులకు అందించాలనే తపనతో ఒక నృసింహ తేజస్సును గ్రంథ రూపంలో ప్రచురించి బహూకరించాలని సంకల్పించినట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో సమాచారం నడుస్తోంది.
‘శత్రు భయంకరం’.. ఈ దివ్యగ్రంధానికి రచనా సంకలనకర్త నాటి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు, రచయిత పురాణపండ శ్రీనివాస్. నాటి ప్రభుత్వంలో మంత్రిగా వున్న పొన్నాల లక్ష్మయ్య అప్పట్లో ఐదారు రకాల పుస్తకాలు అద్భుతంగా పురాణపండ శ్రీనివాస్చే రచింపచేసి, తాను ప్రచురించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలకొలది ఆలయాలకు పంపడంవల్ల ఈ నాటికీ కొన్ని చోట్ల పొన్నాల లక్ష్మయ్య బుక్స్నే పారాయణం చేస్తూ కనిపిస్తున్నారు.