• Home » Punjab

Punjab

Congress: సిద్దూ సంచలనం.. పంజాబ్ సీఎం తన డిప్యూటీగా ఉంటారని సెన్సేషనల్ కామెంట్స్..!!

Congress: సిద్దూ సంచలనం.. పంజాబ్ సీఎం తన డిప్యూటీగా ఉంటారని సెన్సేషనల్ కామెంట్స్..!!

కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గతంలో ఒకసారి తనను కలిశారని వివరించారు. తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారని సిద్దూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని, తన డిప్యూటీగా పనిచేస్తానని చెప్పారని హాట్ కామెంట్స్ చేశారు.

Train Runs Withour Driver: చిక్‌చిక్ రైలు.. దూరం దూరం జరగండి... బెంబేలెత్తించిన గూడ్సు మిస్టరీ..?

Train Runs Withour Driver: చిక్‌చిక్ రైలు.. దూరం దూరం జరగండి... బెంబేలెత్తించిన గూడ్సు మిస్టరీ..?

ఒకటి కాదు, రెండు కాదు, జమ్మూకశ్మీర్ నుంచి పంజాబ్ వరకూ ఏకంగా 70 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా గూడ్సు రైలు దూసుకెళ్లి జనం గుండెల్లో గుబులెత్తించింది. రాళ్ల లోడుతో వెళ్తూ 5 రైల్వే స్టేషన్లను దాటేసింది. అదృష్టం బాగుండి ఆ మార్గంలో ఇతర రైళ్లు కానీ, క్రాసింగ్‌లు కానీ లేకపోవడం, పట్టాలు తప్పకుండా ప్రయాణించడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో రైల్వే శాఖ అధికారులు తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు. తక్షణమే దర్యాప్తు చేపట్టారు.

Farmers Protest:12వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

Farmers Protest:12వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతు ఉద్యమం 12వ రోజుకు చేరింది. శంభు బార్డర్‌లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి 29 వరకూ ఢిల్లీ ఛలో ఆందోళనకు రైతులు విరామం ఇచ్చారు. అప్పటి వరకూ నిరసన శిబిరాల వద్దనే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నేడు క్యాండిల్ మార్చ్, ఫిబ్రవరి 26న కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని ప్రకటించింది.

Delhi Chalo: రైతుల 'ఢిల్లీ చలో' మార్చ్‌ వాయిదా.. నెక్ట్స్ ఎప్పుడంటే

Delhi Chalo: రైతుల 'ఢిల్లీ చలో' మార్చ్‌ వాయిదా.. నెక్ట్స్ ఎప్పుడంటే

యునైటెడ్ కిసాన్ మోర్చా 'ఢిల్లీ చలో(Delhi Chalo)' మార్చ్‌ను ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 29న ఉద్యమంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు సర్బన్ సింగ్ పంధేర్ తెలిపారు.

Farmers Protest: మీ తీరు సరికాదు.. ఇంతటితో ఆపేయండి.. అన్నదాతలపై పోలీసుల జులుం..

Farmers Protest: మీ తీరు సరికాదు.. ఇంతటితో ఆపేయండి.. అన్నదాతలపై పోలీసుల జులుం..

తమ డిమాండ్ల సాధన కోసం శంభు సరిహద్దులో బుల్డోజర్ లతో రైతులు నిరసన చేపట్టారు. కంచెలు తెంచేసి దేశ రాజధాని వైపు తరలివచ్చేందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నారు.

Chalo Delhi: నేటి నుంచి రైతుల ‘చలో ఢిల్లీ’ మళ్లీ ప్రారంభం

Chalo Delhi: నేటి నుంచి రైతుల ‘చలో ఢిల్లీ’ మళ్లీ ప్రారంభం

నేటి నుంచి రైతుల ‘చలో ఢిల్లీ’ మళ్లీ ప్రారంభమైంది. కేంద్రంతో 4వ విడత చర్చలు విఫలం కావడంతో తాజాగా నిర్ణయం తీసుకుంది. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు బోర్డర్ నుంచి రైతులు ఢిల్లీ వైపు బయల్దేరనున్నారు. ఆదివారం అర్థరాత్రి రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల బృందం చర్చలు నిర్వహిస్తోంది.

Farmers protest: రైతులను మందలించిన పంజాబ్ హర్యానా హైకోర్టు

Farmers protest: రైతులను మందలించిన పంజాబ్ హర్యానా హైకోర్టు

కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్‌తో సహా పలు డిమాండ్ల సాధనకు ఆందోళన సాగిస్తున్న రైతులను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మంగళవారంనాడు మందలించింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై వారు ట్రాక్టర్ ట్రాలీలను వాడరాదని స్పష్టం చేసింది.

Chandigarh: ఆ ఓట్లనూ లెక్కలోకి తీసుకోండి.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..

Chandigarh: ఆ ఓట్లనూ లెక్కలోకి తీసుకోండి.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..

చండీగఢ్ మేయర్ ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎనిమిది చెల్లిన ఓట్లు ఉన్నాయని, కాబట్టి మళ్లీ లెక్కించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Farmers Protest: భారత్ బంద్ లో విషాదం.. శంభు సరిహద్దులో గుండెపోటుతో రైతు మృతి

Farmers Protest: భారత్ బంద్ లో విషాదం.. శంభు సరిహద్దులో గుండెపోటుతో రైతు మృతి

తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ర్యాలీలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా వివిధ రైతు సంఘాలు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

Farmers Protest: రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న మూడో రౌండ్ చర్చలు..ఫలించేనా!

Farmers Protest: రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న మూడో రౌండ్ చర్చలు..ఫలించేనా!

రైతుల నేతృత్వంలోని 'ఢిల్లీ చలో' మార్చ్ నిరసనలు గురువారం 3వ రోజుకు చేరాయి. ఈ క్రమంలోనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు గురువారం సాయంత్రం చండీగఢ్‌లోని రైతు నాయకుల చర్చల వేదికకు చేరుకుని చర్చలు జరుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి