Home » Punjab
Punjab: పంజాబ్లోని బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ ఢీకొని బస్సు కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు.
ఖనౌరీలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న దలేవాల్ను టికాయత్ గత వారంలో కలుసుకున్నారు. 70 ఏళ్ల కేనర్స్ పేషెంట్ అయిన దలేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి పంజాబ్-హర్యానా కనౌరి సరిహద్దు ప్రాంతం వద్ద ఆమరణ దీక్షలో ఉన్నారు.
007-2017 మధ్య శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పునకు శిక్షగా సుఖ్బీర్కు మత పెద్దలు తంఖా (మతపరమైన శిక్ష) విధించారు. దీంతో ఆయన శిక్షకు సంబంధించిన ఫలకను మెడలో వేసుకుని, వీల్చైర్పై సేవాదార్గా మంగళవారం నుంచి సేవ కొనసాగిస్తున్నారు.
శిరోమణి అకాలీ దళ్ అధికారంలో ఉన్న సమయంలో మతపరమైన తప్పదాలకు పాల్పడినందున సుఖ్బీర్ సింగ్ మంగళవారం నుంచి 'సేవాదార్'గా శిక్ష అనుభవిస్తున్నారు. సుఖ్బీర్ తప్పిదాలకు స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని అఖల్ తఖ్త్ ఆయనకు శిక్ష విధించింది.
అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఆ క్రమంలో అక్కడున్న వ్యక్తులు అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చాలా మంది ఉండటం విశేషం.
2007 నుంచి 2017 మధ్య అకాలీ దళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పులకు శిక్షగా సిక్కు మత పెద్దలు సుఖ్బీర్ సింగ్ బాదల్కు తంఖా (మతపరమైన శిక్ష) విధించారు. దీంతో మంగళవారం ఆయన తన సహచరలతో కలిసి గోల్డెన్ టెంపుల్ దగ్గర సేవ చేశారు.
స్వర్ణ దేవాలయంతో సహా రాష్ట్రంలో పలు గురుద్వారాల వద్ద సేవాదార్ దుస్తులు ధరించి పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని సుఖ్బీర్ సింగ్ బాదల్ను అకాల్ తఖ్త్ ఆదేశించింది.
శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ సింగ్ చీమా తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు.
హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. పాటల్లో అభ్యంతరకర విషయాల జోలికి వెళ్లొద్దంటూ సూచించింది.