• Home » Protest

Protest

TG News: ప్రజాభవన్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన..

TG News: ప్రజాభవన్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన..

బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 46రద్దు చేయాలంటూ బేగంపేట్‌లోని ప్రజాభవన్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 200మంది అభ్యర్థులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ ముందుగా ప్రజాభవన్‌లో మెమొరాండం అందించారు. అనంతరం ఎన్నికల హామీ మేరకు జీవో 46రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

Delhi Incident: వారి మృతికి మాదే బాధ్యత: ఎంసీడీ అదనపు కమిషనర్ తారిక్

Delhi Incident: వారి మృతికి మాదే బాధ్యత: ఎంసీడీ అదనపు కమిషనర్ తారిక్

ఈనెల 27న రాజేందర్ నగర్ రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో వరదనీటిలో చిక్కుకుని ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అదనపు కమిషనర్ తారిక్ థామస్ స్పందించారు. అభ్యర్థుల మృతికి తమ వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. మా కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Supreme Court: శంభు సరిహద్దుల్లో దశలవారిగా బారికేడ్ల తొలగింపునకు సుప్రీం ఆదేశం

Supreme Court: శంభు సరిహద్దుల్లో దశలవారిగా బారికేడ్ల తొలగింపునకు సుప్రీం ఆదేశం

చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

MP Ayodhya Rami Reddy: ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి దాడులు ఆపాలి..

MP Ayodhya Rami Reddy: ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి దాడులు ఆపాలి..

నెల రోజుల టీడీపీ పాలనలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంట్‌లో గళమెత్తుతామని రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి(MP Ayodhya Rami Reddy) అన్నారు. ఏపీలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యను ఎంపీ ప్రస్తావించారు. బాధితుణ్ని కత్తితో చేతులు నరికి, తీవ్రంగా గాయపరిచి చంపడం దారుణం అని ఎంపీ అన్నారు.

Bangladesh: రిజర్వేషన్లకు తోడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. షేక్ హసీనా ప్రభుత్వంపై నిరసనకారుల ఆగ్రహజ్వాలలు

Bangladesh: రిజర్వేషన్లకు తోడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. షేక్ హసీనా ప్రభుత్వంపై నిరసనకారుల ఆగ్రహజ్వాలలు

బంగ్లాదేశ్‌లో(Bangladesh) ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం కొందరు ఆందోళనకారులు.. ఢాకాకు 40 కి.మీల దూరంలో గల నర్సింగ్డిలోని ఓ జైలును ముట్టడించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో రచ్చ రచ్చ.. భారతీయులకు కీలక సూచనలు జారీ

Bangladesh: బంగ్లాదేశ్‌లో రచ్చ రచ్చ.. భారతీయులకు కీలక సూచనలు జారీ

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.

Farmers protest: మళ్లీ ఢిల్లీకి రైతుల ర్యాలీ.. ఉద్యమం ఆగదని ప్రకటించిన బీకేయూ

Farmers protest: మళ్లీ ఢిల్లీకి రైతుల ర్యాలీ.. ఉద్యమం ఆగదని ప్రకటించిన బీకేయూ

హర్యానా, పంజాబ్‌లను వేరుచేస్తూ శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన దిగ్బంధాలను హర్యానా ప్రభుత్వం తొలగించడంతో మరోసారి రైతులు ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జంతర్‌మంతర్‌లో కానీ, రామ్‌లీలా మైదానంలో కానీ శాంతియుత నిరసనలకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ మంగళవారం తెలిపారు.

TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..

TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..

పెన్‌పహాడ్ మండలం దోసపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని సరస్వతి మృతిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చిన్నారి మృతి పట్ల పొన్నం సంతాపం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Students Protest: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే?

Students Protest: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే?

గ్రూప్-2(Group-2) పోస్టులు పెంచాలని, డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల(OU Arts College) ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా అరకొర నోటిఫికేషన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్‌లోనూ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించారు.

SFI: నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలంటూ ఎస్ఎఫ్ఐ  నిరసన ర్యాలీ..

SFI: నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలంటూ ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ..

విశాఖ: నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విశాఖలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి