Home » Protest
ఇఫ్తార్ విందుతో దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని బజ్రంగదళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లోపు చర్యలు తీసుకోకుండా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు.
కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంపై వివక్షకు నిరసనగా ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ పిలుపిచ్చారు.
K. Rammohan Naidu: ప్రధాని నరేంద్ర మోదీ.. విశాఖపట్నం పర్యటనపై కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు స్పందించారు. విశాఖపట్నానికి త్వరలో ఐటీ సంస్థలు వస్తు్న్నాయని తెలిపారు.
GHMC: ప్రజలకు ఉచితాల పేరుతో పలు పథకాలు ప్రవేశపెట్టి.. ప్రభుత్వాలు పులి మీద స్వారీ చేస్తున్నాయి. ఆ క్రమంలో ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొంటున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వంలో పార్టీ కేడర్ సోమవారం అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు హామీ ఇచ్చిన ప్రతీ ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం వద్ద ప్రశాంత్ కిషోర్ లగ్జరీ వ్యాన్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ వ్యానులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి.
దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి, పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ సూర్యకాంత్, సుదాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం సమీక్షించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ హాజరయ్యారు.
దేశంలోని అన్ని జిల్లాల్లోనూ 'బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్' నిర్వహించాలని కోరుతూ పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసీ వేణుగోపాల్ ఒక సర్క్యులర్ జారీ చేశారు.
మహపుజ అలం ఇటీవల ఫేస్బుక్ ఫోస్ట్లో బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యానించారు.