Home » Priyanka Gandhi
తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్లో ప్రారంభిస్తున్నట్లు ప్రియాంకగాంధీ తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం
నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా.. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా..
ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.
వయనాడ్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను బీజేపీ శనివారంనాడు రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తు్న్న కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పేరును ప్రకటించింది.
వయనాడ్ లోక్సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. 2019 నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ స్థానంలో ఆయన సోదరి ప్రియాంక పోటీ చేయబోతున్నారు. దీంతో ఈ లోక్సభ సీటు అందరి దృష్టిని..
లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక షెడ్యుల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు.
హరియాణాలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయా!? పదేళ్లుగా అధికారంలో ఉండడం ఆ పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతోందా!? రైతులు, కుస్తీ యోధులు, నిరుద్యోగం, ముఠా తగాదాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు! దైనిక్
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి శనివారంనాడు జమ్మూలోని బిష్ణహ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు.
లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) బీజేపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం విదితమే.