Home » Priyanka Gandhi
ఈసారి లోక్సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ల నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.
వయనాడ్, రాయబరేలి క్సభ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో తమ ఫ్యా్మిలీ నియోజకవర్గంగా భావించే రాయబరేలిని రాహుల్ ఎంచుకున్నారు. వయనాడ్ సీటును వదులుకున్నారు.
నీట్ అక్రమాలు, పేపర్లీక్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వం నీట్ కుంభకోణాన్ని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఎ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నీట్ అక్రమాలపై ఆయన సర్కారును ఉద్దేశించి ‘ఎక్స్’లో ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘
ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రాను పోటీలో దించి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భారీ ఓట్ల ఆధిక్యంతో ఆమె ఓడించేందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మహారాష్ట్రలోని సంగ్లి నుంచి గెలుపొందిన విశాల్ పాటిల్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు.
ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. పోటీ చేయాలని చాలా సందర్భాల్లో కోరారు. వివిధ కారణాలతో దూరం అయ్యారు. ఈ సారి మాత్రం లోక్ సభకు ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడుతోపాటు రాయ్ బరేలి నుంచి కూడా బరిలోకి దిగారు. రెండు చోట్ల గెలవడంతో ఒక స్థానానికి రాజీనామా చేస్తారు. రాజీమా చేసే స్థానం వాయనాడు అని కాంగ్రెస్ వర్గాలు సూత్రప్రాయంగా వెల్లడించాయి.
ఇండియా కూటమికి అద్భుతమైన ఫలితాలను అందించిన యూపీ ప్రజలకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. యూపీ వాసులు దేశ ప్రజలకు ధృడమైన సందేశం ఇచ్చారని, రాజ్యాంగ రక్షణకు వారు చూపిన తెగువ అద్భుతమైనదని గురువారం ఎక్స్ వేదికగా కొనియాడారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసిన కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ రెండింటిలోనూ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నియమాల ప్రకారం ఒకే వ్యక్తి రెండు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించకూడదు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలుపు ఖాయమంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ గెలుపు దాదాపు ఖాయం కావడంతో ఆయన తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా 'అడ్వాన్స్ గ్రీటింగ్స్' చెప్పారు. ''కిషోరి భాయ్... మీ గెలుపు ఖాయమని నాకు ముందే తెలుసు'' అంటూ ట్వీట్ చేశారు.