• Home » Pressmeet

Pressmeet

Minister Ponguleti:  చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

Minister Ponguleti: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ వచ్చాక ధరణిని బంగాళా ఖాతంలో వేస్తాం అని చెప్పామని... చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విదేశీ కంపెనీ కబంధహస్తాల నుంచి కేంద్రంలోని ఎన్ఐసికి అప్పగిస్తున్నామన్నారు. 2024 కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకు వస్తున్నామని, 15 దేశాల్లోని మంచి రెవెన్యూ అంశాలను తీసుకుని డ్రాఫ్ట్ తయారు చేశామని చెప్పారు.

CM Chandrababu: గిరిజన ప్రాంతాల అభివృద్ది,  పథకాల ప్రగతిపై  సమీక్షించిన సీఎం

CM Chandrababu: గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాల ప్రగతిపై సమీక్షించిన సీఎం

గిరిజనుల సంక్షేమానికి, గిరిజన ప్రాంతాల అభివృద్దికి అమలు చేస్తున్న పలు పథకాల ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. గిరిజనుల సంక్షేమానికి, వారి ప్రాంతాల అభివృద్దికి కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్తాయిలో వినియోగించుకోవాలని, అందుకు తగిన మ్యాచింగ్ గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ పరంగా విడుదల చేసేందుకు తాను సిద్దంగా ఉన్నామని చెప్పారు.

Minister Kondapalli:  ప్రజలు భయాందోళన చెందేలా ప్రతిపక్షాల వ్యాఖ్యలు..

Minister Kondapalli: ప్రజలు భయాందోళన చెందేలా ప్రతిపక్షాల వ్యాఖ్యలు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ అసిస్టెంట్స్‌కు వేతనాలు ఇవ్వలేదని.. గతంలో వైసీపీ చేసిన బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నెపం నెట్టుతారా.. అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలు భయాందోళన చెందేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Deputy CM: వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: పవన్ కల్యాణ్

Deputy CM: వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: పవన్ కల్యాణ్

వాల్మీకి జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. రామాయణాన్ని సంస్కృతంలో రచించి భారతావనికి అందించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని, పరిపాలనను కళ్ళకు కట్టే రామాయణం ప్రజలకు నైతిక వర్తనను వెల్లడిస్తుందని, ధర్మాన్ని అనుసరించి ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందన్నారు.

KTR: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై కేటీఆర్ కామెంట్స్..

KTR: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై కేటీఆర్ కామెంట్స్..

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. 10నెలలు - 25 సార్లు - 50రోజులు.. పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు..అయినను పోయి రావాలె హస్తినకు’ అంటూ కామెంట్స్ చేశారు.

Anitha: అత్తా కోడళ్ళపై దారుణం.. 48 గంటల్లో నిందితుల అరెస్టు: హోంమంత్రి

Anitha: అత్తా కోడళ్ళపై దారుణం.. 48 గంటల్లో నిందితుల అరెస్టు: హోంమంత్రి

పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్‌లు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

Konda Surekha: గీసుగొండ వివాదంపై  మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..

Konda Surekha: గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్ వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం.. మంత్రి సురేఖ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది. దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది.

Nara Lokesh: ఇచ్చిన మరో హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

Nara Lokesh: ఇచ్చిన మరో హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న అన్ని జిల్లాల్లోనూ వాల్మీకి జయంతి అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా మంత్రి సవిత పాల్గొంటారు.

Jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

Jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

తాను ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి ఆయన కోటాలోనే తన భార్య నిర్మలకు పదవిచ్చారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని, అదిరేటొడు.. బెదిరేటోడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని అన్నారు. ప్రాణికి చావుంది కానీ పైసాకు చావు లేదు

Minister Lokesh: జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుంది..

Minister Lokesh: జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుంది..

యాక్షన్ అయితే అనివార్యమని, వైసీపీ వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే స్పష్టత లేదని.. కానీ తన నుంచి ఇన్స్పైర్ అయ్యారని అర్ధమైందని, రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయని, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి