• Home » Pressmeet

Pressmeet

Anam; జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగదు: ఆనం వెంకట రమణారెడ్డి

Anam; జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగదు: ఆనం వెంకట రమణారెడ్డి

వైసీపీ నేతలు కత్తులు, గన్నులతో కేవీరావును అన్ని విధాలా బెదిరించి భయపెట్టి 4 వేల ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల రూపాయల పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆక్వాకల్చర్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.

Harish Rao: రేవంత్ రెడ్డి మీ పాలన మార్పు మార్కు ఇదేనా...

Harish Rao: రేవంత్ రెడ్డి మీ పాలన మార్పు మార్కు ఇదేనా...

మాజీ మంత్రి హరీష్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకాడుతున్నారని, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తున్నారని.. ఇదేం విడ్డూరం... ఇదెక్కడి న్యాయం.. ఇదేం ప్రజాస్వామ్యం.. రేవంత్ రెడ్డి పాలన మార్పు మార్కు ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు.

Revanth Reddy: చంద్రబాబుకు రోశయ్య ఏం చెప్పారంటే..: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: చంద్రబాబుకు రోశయ్య ఏం చెప్పారంటే..: సీఎం రేవంత్ రెడ్డి

‘‘చూడయ్య చంద్రబాబు నాకు చీరాలలో ఏమీ లేదు.. 50 ఏళ్ళ క్రితం అక్కడున్నది అమ్ముకుని హైదరాబాద్‌కు వచ్చి.. అమీర్‌పేట ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా.. నేను హైదరాబాద్ వాడినే తప్ప.. నాకు ఆ రాష్ట్రమా.. ఈ ప్రాంతమా అనేది లేదని.. రెండు ప్రాంతాలు నాకు సమానమే’’ అని రోశయ్య చంద్రబాబుకు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

BRS: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డి ఏడాది పాలనపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు

BRS: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డి ఏడాది పాలనపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు

రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వె‌న్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు.

TDP: ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదు: బుద్దా వెంకన్న

TDP: ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదు: బుద్దా వెంకన్న

రాంగోపాల్ వర్మకు దమ్ముంటే.. ధైర్యంగా నిలబడాలని.. అప్పుడు చేసింది కరెక్టు అని చెప్పాలని.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్‌ల గురించి సినిమా తీయాలని బుద్దా వెంకన్న డిమండ్ చేశారు. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని.. ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ అంటున్నారని.. జగన్‌కు సిగ్గు ఉందా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ సినిమాల గురించి మాట్లాడతారా.. అంటూమండిపడ్డారు.

Janasena: దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్: మంత్రి నాదెండ్ల

Janasena: దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్: మంత్రి నాదెండ్ల

కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకు అని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సిఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని, రూ.16 వేల కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు.

Minister Anam: తిరుమలలో చాలా మార్పులు వచ్చాయి: మంత్రి ఆనం

Minister Anam: తిరుమలలో చాలా మార్పులు వచ్చాయి: మంత్రి ఆనం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని, పూర్వ వైభవం తీసుకువచ్చామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో భక్తులు అనేక ఇబ్బందులు పడే వారని.. ప్రస్తుతం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.

CM Chandrababu: గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని....

CM Chandrababu: గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని....

గత అయిదేళ్లు మర్చిపోదాం అనుకున్నా.. అందరికి గుర్తుండాలని.. నాల్గవ సారి సీఎం అయినా ఇంకా పూర్తిగా విద్వంసానికి గురయిన వ్యవస్ధను కాపాడడం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాధమిక హక్కులు కాలరాశారని విమర్శించారు. రాజ్యాంగంలోని జరిగిన తప్పిదాలు వల్ల కొన్ని దశాబ్దాలు ఇబ్బంది పడతామని ఆయన పేర్కొన్నారు.

Raghurama: నన్ను దారుణంగా చిత్రవధ చేశారు..చంపాలని చూసారు

Raghurama: నన్ను దారుణంగా చిత్రవధ చేశారు..చంపాలని చూసారు

తన కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రఘురామ కృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. తనను దారుణంగా చిత్రవధ చేశారని.. చంపాలని చూసారని అన్నారు. అందుకు సాక్ష్యంగా మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయన్నారు. న్యాయం గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Rahul: యూపీలోని సంభాల్ కాల్పుల ఘటనపై రాహుల్ ఏమన్నారంటే..

Rahul: యూపీలోని సంభాల్ కాల్పుల ఘటనపై రాహుల్ ఏమన్నారంటే..

సంభాల్ కాల్పుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత తొందరపాటు వైఖరి అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందూ-ముస్లిం సమాజాల మధ్య చీలికలు, వివక్షను సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకోవడం రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలిగించదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి