Home » Pressmeet
సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా.. పుష్పా సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి థియేటర్లో కూర్చిని చూడగలమా.. ‘లేస్తే ఒకసారి , కూరుచుంటి ఒకసారి ’ అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మొక్కుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు శబరిమల వెళ్ళటానికి నల్ల దుస్తులు ధరించినట్లుందని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ. 3.89 లక్షల కోట్లు అని స్పస్టత ఇచ్చిందని.. గతంలో సీఎంపై తాము ఉల్లంఘనా నోటీసు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. గతంలో నాదెండ్ల మనోహర్ ఉల్లంఘన నోటీసు అడ్మిట్ చేశారన్నారు.ఈ ప్రభుత్వం ఆర్ధిక విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని తాము కోరుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయాలని.. మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుందని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్ర వెంకటేశం అన్నారు. చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు.
లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి.. రైతులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చంద్రబాబు అన్నారు.
రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణా తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కల్గించేలా వ్యవహరించారని కేటీఆర్ పేర్కొన్నారు.
తప్పులు బయటపడుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి.. వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు.
వైఎస్పార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యదు చేసినట్లు తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. విజయసాయికి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని అన్నారు.