Home » Prashant Kishor
జన్ సురాజ్ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు.
అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఆదివారంనాడు మాట్లాడుతూ, 2న పార్టీ ఆవిర్భావం కోసం ప్రత్యేక సన్నాహకాలు అవసరం లేదని, రెండు సంవత్సరాలు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు.
రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బహిరంగ చర్చల సందర్భంగా చాలాసార్లు బీహార్(bihar)లో ప్రకటించారు. కానీ తాజాగా మాత్రం RJD నేత తేజస్వి యాదవ్కు సవాల్ విసిరారు. అయితే ఏమన్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తమ 'జన్ సురాజ్' పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, వీరిలో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు ఉంటారని తెలిపారు.
ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ 'జన్ సురాజ్ అభియాన్' రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు ముహూర్తం నిశ్చయమైంది. అక్టోబర్ 2వ తేదీన పార్టీగా 'జన్ సురాజ్' అవతరించనుంది.
బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం నితీష్ కుమార్ ఏం చేసేందుకు అయినా వెనకాడారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కాళ్లకు నమస్కారం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్కు అధికారం, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం.. అందుకోసం ఆయన ఏం చేయాలని కోరినా సరే చేస్తారని మండిపడ్డారు.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఇద్దరూ ‘పీకే’లు వైసీపీ (YSR Congress) జెండాను పీకి పడేశారు..! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయింది..! ఎంతలా అంటే వైనాట్ 175 నుంచి సింగిల్ డిజిట్కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పీకేలను కూటమి పార్టీ శ్రేణులను గుర్తు చేసుకుంటున్నారు...
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో పసిగట్టలేనంతగా వైరల్ అవుతున్నాయి. చివరికి.. ఈ ఫేక్ వార్తల ఛట్రంలో..
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం విజయతీరాలకు చేర్చే అవకాశాలున్నాయని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2019లో బీజేపీ సాధించిన 303 సీట్లకు దగ్గరగా కానీ, దానికి స్వల్పంగా అధిగమించే అవకాశాలు కానీ ఈసారి ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ గ్యాప్లోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వర్సెస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా పరిస్థితులు నెలకొన్నాయి.