Home » Prakasam
బాపట్ల జిల్లా: చీరాల మండలం, ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి..
ప్రకాశం జిల్లా: ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు పార్లమెంట్తో పాటు ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది.
కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై స్థానికులు దాడులు చేస్తున్న వేళ.. తెలుగు విద్యార్థులు కొందరు అక్కడే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాకి(Prakasham Dist) చెందిన10 మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు కిర్గిస్థాన్ వెళ్లారు.
నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది.
ప్రకాశం జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని.. దీంతో ఏం చెప్పాలో తెలీక జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేను ఏకిపారేశారు. ఎమ్మెల్యేగా ఉండి బాగా సంపాదించారని.. అన్నీ దోచేశారంటూ విరుచుకుపడ్డారు.
పాపం ఆ దొంగలకు.. దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచాలో అర్థం కాలేదనుకుంటా. అందుకే మర్రి చెట్టు తొర్రలో దాటి పెట్టారు. అది కూడా ఒకటి.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 66 లక్షలు. అయితే దొంగతనం జరిగిందన్న తర్వాత.. పోలీసులు ఉరుకుంటారా? ఆ దొంగలను పట్టుకొన్నారు.
వైసీపీ(YSRCP) బరితెగింపు పరాకాష్ఠకు చేరింది. ఒంగోలులో వరుస ఘటనలే అందుకు నిదర్శనం. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే(Police Station) ఎమ్మెల్యే, ఆయన తనయుడు, వారి అనుచరులు హల్చల్ చేశారు. శుక్రవారం ఉదయం ఒంగోలు(Ongole) వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వైసీపీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivas Reddy), ఆయన తనయుడు ప్రణీత్రెడ్డి తన అనుచరులతో..
బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్(YS Jagan) సొంత పార్టీ ఎమ్మెల్యేలే పెద్ద ఝలక్ ఇచ్చారు. ప్రకాశం(Prakasam) జిల్లాలో జగన్ బస్సు యాత్ర సాగుతుండగా.. జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి(Mahidhar Reddy), దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్(Venugopal) ఈ బస్సు యాత్రకు..