Home » Prakasam
Andhrapradesh: కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.
జనసేన పార్టీలో గురువారం అంటే.. 26వ తేదీన చేరనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో రెండు మూడు మీటింగ్స్లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని, పరదాల మాటున వచ్చేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదని చెప్పారు. గతంలో ఎన్నడూ చూడనివిధంగా కూటమికి విజయం కట్టబెట్టారని అన్నారు. జగన్ సభలకు డ్వాక్రా మహిళలను లాక్కుని వచ్చేవారని ఆరోపణలు చేశారు.
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం, చదలవాడ చేరుకుంటారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు.
అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba Reddy) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇల్లు, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఎంపీ ఖండించారు.
ప్రకాశం బ్యారేజీలో మరో సిమెంటు దిమ్మె (కౌంటర్ వెయిట్) దెబ్బతిన్నట్లు గుర్తించారు. 67, 68, 69 నంబరు ఖానాలతో పాటు 66వ ఖానా వద్ద ఉన్న దిమ్మె కూడా దెబ్బతిందని.. పగుళ్లు ఉన్నాయని బెకెమ్ కంపెనీ బృందం గురువారం గుర్తించింది.
Andhrapradesh: ఒంగోలులో శిశువు విక్రయం తీవ్ర కలకలం రేపింది. ఒంగోలు రిమ్స్లో పది వేలకు కన్న కూతురుని విక్రయించిన అంగన్వాడీ కార్యకర్త మంజుల. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన బాలసుందరరావుకి మధ్యవర్తుల ద్వారా చిన్నారిని విక్రయించింది. పాపని అమ్మిన తర్వాత అంగన్వాడీ కార్యకర్త రిమ్స్లో కనిపించకుండా పోయింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.