Home » Potti Sriramulu
అమరావతి: తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మ త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు అమరజీవి. మహా పురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. ఆయన జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఘనంగా నివాళులర్పించారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలు కాలమంతా గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేయడమే సరిపోయిందని సీఎం చంద్రబాబు చెప్పారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పొట్టి శ్రీరాములు గొప్ప తనం అర్థమైందన్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే..
తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రస్తుతమున్న పొట్టి శ్రీరాములు పేరును మార్చాలని చేస్తున్న ప్రయత్నాలు అర్ధరహితమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పేర్కొంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ)ని స్థాపించి మూడేళ్ల డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సును 2024-25 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నంబరు 11ను విడుదల చేసిందని చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజ రామయ్యార్ తెలిపారు.
భార్య వియోగంతో 25 ఏళ్ళ ప్రాయంలోనే ఐహిక బంధాలను త్యజించి, గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు చేరారు. ఆశ్రమంలో ఆయన సేవానిరతికి గాంధిజీ ముగ్ధులయ్యారు. 'మొండితనా'నికి ముచ్చటపడ్డారు.