• Home » Politicians

Politicians

Election Commission : జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా సవరణ

Election Commission : జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా సవరణ

హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను మొదలు పెట్టామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

BJP : గడ్కరీతో కిషన్‌ రెడ్డి భేటీ..

BJP : గడ్కరీతో కిషన్‌ రెడ్డి భేటీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలోని గడ్కరీ కార్యాలయానికి వెళ్లి కిషన్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

PARITALA SUNITA : పరిజ్ఞానం లేకుండా డ్యాం గేట్లు విరిచారు

PARITALA SUNITA : పరిజ్ఞానం లేకుండా డ్యాం గేట్లు విరిచారు

లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పి.. కనీస పరిజ్ఞానం లేకుండా పేరూరు డ్యాం గేట్లు విరగొట్టారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టును అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు నిర్మించే పరిటాల రవీంద్ర సాగునీటి కాలువతోపాటు పుట్టుకనుమ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను సందర్శించారు. ...

MINISTER SATYA KUMAR: ఆరోగ్య మంత్రికి ఘన స్వాగతం

MINISTER SATYA KUMAR: ఆరోగ్య మంత్రికి ఘన స్వాగతం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌ యాదవ్‌కు ఘన స్వాగతం లభించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు గొంది అశోక్‌ కుమార్‌, రావి చైతన్య కిషోర్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను మంగళవారం ఘనంగా సత్కరించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర

Nara Lokesh: ఐదేళ్లలో మూతపడిన బడులెన్ని?

Nara Lokesh: ఐదేళ్లలో మూతపడిన బడులెన్ని?

విద్యా వ్యవస్థలో మార్పులకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ శ్రీకారం చుట్టారు. శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

 ALET Maheshwar Reddy: చంద్రబాబును చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలి

ALET Maheshwar Reddy: చంద్రబాబును చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై చంద్రబాబు సంతకం చేశారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయన్ను చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా హామీల ఊసే లేదని మండిపడ్డారు.

CS Shantikumari :ఆరుగురుకి డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతి

CS Shantikumari :ఆరుగురుకి డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతి

రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరుగురు సహాయ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జీవోను జారీ చేశారు.

CSDS survey :బీజేపీకి  తగ్గిన  3%  దళిత ఓట్లు

CSDS survey :బీజేపీకి తగ్గిన 3% దళిత ఓట్లు

దళితులు జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపినట్టు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలపై సీఎ్‌సడీఎస్‌ సర్వే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం దళితులు బీజేపీకన్నా ఇతర పార్టీలను ఆదరించారు.

Tamilisai: మందలించ లేదు.. సలహాలు ఇచ్చారు

Tamilisai: మందలించ లేదు.. సలహాలు ఇచ్చారు

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనను మందిలించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై వివరణ ఇచ్చారు. ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు.

Bengaluru court: యడియూరప్పకు నాన్‌బెయిలబుల్‌  వారెంట్‌

Bengaluru court: యడియూరప్పకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్‌ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి