Home » Politicians
‘ఇప్పటి వరకూ మనకోసం మనం కష్టపడ్దాం. ఇకపై రాష్ట్ర ప్రజల కోసం కూడా పాటుపడదాం’ అంటూ ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్(Vijay) కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్ గోపి తెలిపారు.
చెరువులను చెరబట్టి.. నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాల పైకి బుల్డోజర్ వెళ్తోంది..! ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది..!
తెలంగాణ కాంగ్రె్సలో పదవుల భర్తీకి వేళయింది. దీనిపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం (16న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు.
విదేశాంగ శాఖ మాజీ మంత్రి కే నట్వర్సింగ్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దౌత్య, రాజకీయ రంగాలతో పాటు రచనా వ్యాసంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.
ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖడ్ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.
ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు మార్చాలని సుప్రీం కోర్టు నిలదీసింది. నిందితుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టులు ప్రభావితం అవుతాయా? అంటూ అసహనం వ్యక్తం చేసింది.