Home » Police
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యానించారు. తాజాగా ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందని అన్నారు. ఇలా అనేకం జరుగుతున్నా వైసీపీ(YCP) మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు(police) ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది.
యూట్యూబ్(Youtube) చూస్తూ బ్యాంక్లో చోరీకి యత్నించిన ఎంబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసుల కథనం మేరకు... మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం అరియపట్టి గ్రామానికి చెందిన లెనిన్ (30) ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్లో పనిచేస్తున్నాడు.
తిరుపతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మంది మారణాయుధాలతో దాడి చేయగా నానీ భుజానికి గాయమైంది.
తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కిరణ్ను వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరికివేశారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని ఇతర ప్రాంతాలకు పోలీసులు తరలించారు.
జరిగిన ఆంధ్రప్రదేశ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు కోసం సోమవారం కర్ణాటక నుంచి బందోబస్తు కోసం వెళ్లిన పోలీ సులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని, అవమానకరమైన రీతిలో వ్యవహ రించారని కొందరు పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశలోని కర్నూల్ జిల్లాకు బందోబస్తు కోసం వెళ్లేందుకు పోలీసు సిబ్బందిని పశువులను తరలించే ట్రక్కులో ఆ ప్రాంతంలోని రూట్ మ్యాప్కు పంపారని అక్కడకు వెళ్లిన పోలీసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్లో టీడీపీకి చెందిన నేత వాహనాన్ని నడిరోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టారు.
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ కవ్వింపులు.. బెదిరింపు చర్యలకు దిగింది. టీడీపీ వర్గీయులు ఎదురు తిరిగినచోట కర్రలు, రాళ్లతో విరుచుకుపడింది. ఈ దాడులలో పలువురు ఓటర్లు, టీడీపీ వర్గీయులు, ఓ బీఎస్ఎఫ్ జవాను గాయపడ్డారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటమి భయంతో.. పోలింగ్ను అడ్డుకునేందుకు వైసీపీవారు ఇలా వ్యవహరించారని టీడీపీ కూటమి అభ్యర్థులు మండిపడ్డారు....