Home » Police case
Crime News:పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్ పేట్కు చెందిన యువతి బెంగుళూరులో ఓ కామన్ ఫ్రెండ్స్ మీటింగ్లో శశాంక్ వేలూరిని కలిసింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి డేటింగ్ కూడా చేశారు.
రూ.మూడున్నర కోట్లకు పైగా పలువురి దగ్గర అప్పులు తీసుకొని అప్పు ఇచ్చిన వారిపైనే దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తున్న గ్యాంగ్పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ మదనపల్లికి చెందిన సుమారు 30 మందికి పైగా బాధితులు ఎస్పీ విద్యాసాగర్నాయుడుకు తమ గోడును విన్నవించారు.
Harassment case: మహిళను వేధిస్తుండటంతో రెడ్ శాండల్ టాస్క్ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్పై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తూ... కాపురంలో గొడవలు పెడుతున్న విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది.
Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. అదనంగా, అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై రూ. 192 కోట్ల అక్రమ లాభాల ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరో కేసు నమోదు అయింది.
Kakani: క్వార్జ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకుండా రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు.
వ్యసనాలకు, లగ్జరీ జీవితానికి అలవాటుపడిన కొందరు కిలేడీలు డబ్బులు సంపాదనకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వలపు విసిరి సాయం ముసుగులో నిలువునా దోచేస్తున్నారు. ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని, ఒంటరి మహిళ అని సానుభూతి చూపిస్తే ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Chetan Jewellers: కూకట్పల్లి ప్రగతినగర్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని నితీష్ జైన్ పరారయ్యాడు. కేపీహెచ్బీ, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ తన వ్యాపారాన్ని నిర్వహించాడు.
Fraud Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావును చీటింగ్ కేసులో అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ4గా శ్రవణ్ రావు భార్య స్వాతి రావును చేర్చారు. ఆమెను కూడా సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు.
Crime News: కూలి పనులు చేసుకుంటూ కేశవగిరిలో నివాసం ఉంటున్న కేతావత్ బుజ్జి అనే మహిళ.. భర్త చనిపోవడంతో.. ఒంటరిగా ఉంటోంది. వెస్ట్ బెంగాల్కు చెందిన మేస్త్రీ జుల్ఫికర్ అలీతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.