Home » Police case
గత వారం రోజులుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే భయాందోళనలో ఆయన ఉన్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా సాగుతుంది.
మైనర్ బాలికపై అటమ్ట్ రేప్ జరిగిందని దుష్ర్పచారం చేయడంతో.. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బాలిక భవిష్యత్ను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
పోలీసులు తనకిచ్చిన నోటీసులపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని, విచారణకు సహకరిస్తానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు.
విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
కాగా సినీ నటి, వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తాజాగా గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.
గత రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో అదృశ్యమైన ముగ్గురు బాలుర మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే చేధించారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి.. బాలురను సురక్షితంగా వారి తండ్రి చెంతకు చేర్చారు.
కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాముడు అనే వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు (అన్నదమ్ములు) మిస్సింగ్ అయ్యారు. ఉదయం స్కూల్కు అని బయలుదేరినవారు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు మచిలీపట్నం, ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.