Home » Police case
రాజమండ్రి, బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఆమె నైట్ డ్యూటీలో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వచ్చాడు. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుతో అతను అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు.
హత్యలకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మహమ్మద్ సిరాజ్ అలీ, భార్య హేలియ, కుమారుడు హైజాన్.. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిరాజ్ భార్య, కొడుకుని హత్య చేసిన తర్వాత సూసైడ్ నోటు రాసి ఉరి వేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్కు చెందిన సిరాజ్ కుటుంబం..
మంచు కుటుంబంలో ఊహించని మలుపులు.. నిముషానికొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులతో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ రెచ్చిపోయాడు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. కోర్టు అనుమతితో అనిల్ను అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు.. టీడీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా గుడివాడ వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు.
ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.
కన్నడ నటి శోభిత మృతి కేసులో విచారణ చేస్తున్న గచ్చిబౌలి పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్లో ‘మీరు చావాలి అనుకుంటే యు కెన్ డు ఇట్’ అని రాసుకున్న శోభిత.. సూసైడ్ నోటు ఆధారంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా... భర్తతో విభేదాలా... సీరియల్స్ మూవీస్కు దూరంగా ఉండటమా.. అనే దానిపై విచారణ చేస్తున్నారు.
ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్లో దళితుడిని ఆర్కే రోజా అవమానించిందని ఆయా సంఘాలు ఆరోపించాయి.
సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.