Home » Police case
పోలీసుల వ్యవహారశైలితో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగా, శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బుగ్గిపాలైపోయాడు. అతను పులియాంతోపు తిరువికనగర్ 7వ వీధికి చెందిన రాజన్ (42)గా గుర్తించారు.
నాగర్కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
అమాయకులను మోసం చేసి నకిలీ ఇన్సూరెన్సులు సేల్ చేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని తయారు చేసి భారీ మోసాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పండుగపూట బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డివో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352, 292 కింద కేసులు నమోదు అయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా, కేశవపట్టణం గ్రామం మొదటి నుంచి కలప స్మగ్లింగ్కు పేరుగాంచింది. ఈ గ్రామంలో చాలా మంది కలప స్మిగ్లింగ్ చేసి జీవనోపాధిని పొందుతారు. అయితే గ్రామంలో పెద్ద మొత్తంలో కలప నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారుల బృందాలు అక్కడకు వెళ్లాయి. ఇళ్లల్లో ఉన్న కలపను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
న్యూ ఇయర్ వేళ ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి వచ్చి చూడగా 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో పేర్ని నానిని పోలీసులు ఏ-6గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా, బందరు తాలుక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది.
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. కోదాడ మండలం, నల్లబండగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
ఎస్ఐ, కానిస్టేబుల్, నిఖిల్.. ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఓపెన్ కానీ ఫోన్ల లాక్స్ అడ్డంకిగా మారాయి. శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి - నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై కూడా విచారణ చేస్తున్నారు. ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నారా...