Home » Police case
న్యూ ఇయర్ వేళ ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి వచ్చి చూడగా 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో పేర్ని నానిని పోలీసులు ఏ-6గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా, బందరు తాలుక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది.
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. కోదాడ మండలం, నల్లబండగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
ఎస్ఐ, కానిస్టేబుల్, నిఖిల్.. ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఓపెన్ కానీ ఫోన్ల లాక్స్ అడ్డంకిగా మారాయి. శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి - నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై కూడా విచారణ చేస్తున్నారు. ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నారా...
సిద్దిపేట: పట్టణం కలకుంట కాలనీలో విషాదం నెలకొంది. ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పండరి బాలకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యా పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా.. ఆయన భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అరెస్టు కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 20 రోజులకుపైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు, కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
10 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
జననసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై స్థానిక జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. నవంబర్ 18 న కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దువ్వాడకు 41 ఏ నోటీసులు ఇచ్చి.. విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఆయన మాధురితో కలిసి విచారణకు వచ్చారు.
కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.