Home » Police case
రాజ్తరుణ్-లావణ్య కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస్పై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ.. సైబరాబాద్ సీపీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫామ్హౌస్లో భారీగా క్యాసినో, కోడి పందాలు ఆడుతున్నవారిపై రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేశారు.
సాక్షులను నిర్దిష్ట తేదీల్లో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి..
స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. అదును చూసి.. ఆ యువతిని అత్యాచారం చేసి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజా(Senior BJP leader H. Raja)పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.
నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావు భారీ అవినీతి, అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సిబ్బంది, అధికారుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా విచారణ చేపట్టారు. విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఐ భుజంగరావు సమర్ధించుకున్నాడు.
దేశంలో రోజు రోజుకు దొంగనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ ఖాతాదారుడు అంజిబాబు డబ్బులు డిపాజిట్ చేశాడు. అయితే డిపాజిట్ చేసిన డబ్బుల్లో దొంగనోట్లు జమ అయినట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. దీనిపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.
విశాఖ జిల్లా: భీమిలిలో హనీ ట్రాప్ కలకలం రేపింది. రామారావు అనే వ్యక్తికి ఓ యువతి ఫోన్ చేసి శ్రీకాకుళం జిల్లా, సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని కోరింది. అతను ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే ముగ్గురు దుండగులు అతనిని కిడ్నాప్ చేసి.. అతని వద్ద ఉన్న డబ్బు, ఏటీఎం కార్డు తీసుకున్నారు.