Home » Perni Nani
అధికారులు జరిపిన వార్షిక తనిఖీల స్టాక్లో భారీగా రేషన్ బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లుగాః గుర్తించారు. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాన, ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
పీడీఎస్ బియ్యం స్వాహా కేసులో డబ్బులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించేలా లేవు. ఈ ఘటనలో జరిమానా సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినా క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
తన గోడౌన్లో పీడీఎస్ బియ్యం మాయమైన కేసు నుంచి బయటపడే ప్రయత్నాల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు.
కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బందరు తాలుకా పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మానస తేజపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌరసరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది.
వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని ఎర్నీ బదలబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Andhrapradesh: రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనపడటం లేదని.. ఓటర్లు ప్రశాంతంగా బయటకు వచ్చి ఓట్లేసే పరిస్థితి లేదన్నాు. పాకిస్థాన్ తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు వైసీపీ వారిని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: నిన్నటి వరకు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నానా యాగీ చేశారని పేర్నినాని అన్నారు. నిన్నటి రోజున కల్తీ నెయ్యి దానిలో వాడారో తెలియదని అంటున్నారని తెలిపారు. దీనిబట్టి చూస్తుంటే కేవలం జగన్ను రాజకీయంగా అంతం చేసేందుకే చంద్రబాబు తిరుపతి లడ్డూపై కలంకితం మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.