Home » Penukonda
కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర సెర్ప్, ఎంఎ్సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన ఎంఎ్సఎంఈ సెర్ఫ్ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
‘ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కేసు వద్దు రాజీ అవుతామని చెప్పినా ఉద్దేశ్యపూర్వకంగా కుటుంబాన్ని వేధిస్తూ రాత్రంతా ఓ రైతును ఆసుపత్రికి పంపకుండా పోలీస్ స్టేషనలో పెట్టడం దారుణం.. అక్రమ నిర్బంధాలు సరికాదు, పోలీసుల తీరు మారాలి’ అంటూ పెనుకొండ పోలీస్ స్టేషనలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ ఆదివారం పోలీసులపై చిందులు తొక్కారు.
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రోడ్లపై గుంతలకు మట్టి కూడా వేయలేకపోయిందనీ, కూటమి ప్రభుత్వం నెలల వ్యవధిలోనే కొత్త రోడ్లు వేస్తోందనీ అభివృద్ధి అంటే ఇదీ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేతజౌళి శాఖ మంత్రి సవిత.. వైసీపీ నాయకులు చురకలు అంటించారు.
స్థానిక మండల కాంప్లెక్స్ సమీపాన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న పునాదిని గురువారం తొలగించారు. తహసీల్దార్ మారుతి.. వీఆర్వో మన్సూర్, వీఆర్ఏ వినోద్ తదితర సిబ్బందితో కలిసి ఎక్స్కవేటర్తో నిర్మాణాన్ని తొలగించి, చదును చేయించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్, టాటాగ్రూప్స్ చైర్మన రతనటాటా మృతి భారతదేశానికి తీరనిలోటని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు.
నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియతోపాటు దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదని ఎక్సైజ్ సీఐ సృజనబాబు తెలిపారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించిన ప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎంపీ బీకే పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ అన్నారు.
పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పెనుకొండ నగర పంచాయతీ రోడ్డు నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇటీడీపీ మడకశిర రహదారిలోని ఎగువ ప్రాంతం నుంచి మురుగు కాలువపై కల్వర్టు బ్లాక్ అయి మురుగునీరు రోడ్డుపై ప్రవహించింది.
‘రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన ఆప్కో షోరూమ్లను పునఃప్రారంభించి, మరింత అభివృద్ధిపరుస్తాం. చేనేతలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలి’ అని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు.
నిరుపేదల పాలిట అన్న క్యాంటీన ఓ వరమని, రూ.5కే కడుపునిండా అన్నం పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడుకు రావడం, దానిని రాష్ట్ర వ్యాప్తంగా ఆచరించడం అది టీడీపీకే సాధ్యమని మంత్రి సవిత అన్నారు. గురువారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న అన్న క్యాంటీనలో మంత్రి ప్రజలకు అన్నం వడ్డించి అలాగే రుచి చూశారు.