Home » Peddi Reddi Ramachandra Reddy
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ జరిగిందని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని విమర్శించారు. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందని మండిపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుందా..? ఇప్పుడిదే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక..
Andhrapradesh: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డిని వీరప్పన్తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. వారి దాడులు, దారుణాలు చెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో భూ రికార్డుల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కుటుంబంపైనే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా స్పందించారు...
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి భూముల దందాలకు బ్రేక్ వేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్. పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు కాజేశారు.
తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు.
పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఏకచత్రాధిపత్యానికి కళ్లెం పడింది. గతంలో కనుచూపు మేరలో కనిపించని టీడీపీ..