Home » Payyavula Keshav
రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిత్య శాఖలు పయ్యావుల కేశవ్కు దక్కడంతో జిల్లాలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ కీలక భూమిక పోషించనున్నారనడంలో సందేహం లేదు. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే కరువు జిల్లా అనంతకు దక్కిన అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా చరిత్ర లో ఎంతోమంది మంత్రులుగా పనిచేసినా జిల్లాకు ఆర్థికశాఖ దక్కలేదు. ఆ అరుదైన అవకాశాన్ని పయ్యావుల కేశవ్ దక్కించుకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ...
ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వ్యాఖ్యానించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నానని చెప్పారు.
: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియారిటి, సామాజిక సమీకరణాల ఆధారంగా శాఖల కేటాయింపు చేశారు. పయ్యావుల కేశవ్కు కీలక శాఖలు అప్పగించారు. మంచి వక్త అయిన కేశవ్కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పజెప్పారు.
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..
తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.
నా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప.. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా చేసేందిమీ లేదు. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తాను. సూపర్ సిక్స్ పథకాలే మా అస్త్రం. నియోజకవర్గంలో సాగు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం చూపుతాను. హంద్రీనీవా నీటితో ఆయకట్టును కోనసీమ తరహాలో అభివృద్ధి చేస్తాను’ అని టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. ...
ఎన్నికలలో మహిళలను ప్రలోభ పెట్టేందకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది. ఉరవకొండ పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో యానిమేటర్లతో మాజీ ఎంపీపీ చంద్రమ్మ గురువారం రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వ ప్రధాన అనుచరుడు పాల్గొనడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అక్కడి ...
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..
ఎన్నికల్లో వైసీపీ(YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. సీఈఓ కార్యాలయంలో శనివారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అక్రమ ఎత్తుగడలపై ఫిర్యాదు చేశానని చెప్పారు. టీడీపీ ఎన్నికల ప్రచార బృందాలపై వైసీపీ నేతలు ఏదో ఒక గొడవ పెట్టకొని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. శనివారం నాడు ఉరవకొండలో "రా.. కదలి రా' సభ నిర్వహించారు ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.