Home » Parliament
రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్కడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు.
Andhrapradesh: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shinath) కోరారు. సోమవారం లోక్సభలో రూల్ 377 కింద పొలవరం ప్రాజెక్ట్ నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిషన్ మోడ్ కింద పోలవరం ప్రాజెక్ట్ను తిరిగి ట్రాక్లోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్ మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు.
కన్వర్ యాత్ర, నీట్, మణిపుర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాష్ట్రాలు, రెండు మిత్రపక్షాలు(టీడీపీ, జేడీయూ) తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటి నడుమ మంగళవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నాయి. సభలో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. గురువారం సాయంత్రం లోక్సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్లో బిల్లుల జాబితాను విడుదల చేశారు.
లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపీ గౌరవ్ గొగోయ్కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్ విప్గా సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్, విప్లుగా మాణిక్కం ఠాగూర్, మహమ్మద్ జావేద్లను నియమించింది.