Home » Parliament
వక్ఫ్ బోర్డు(Waqf Board) చట్టానికి అనేక సవరణలు కోరుతూ కేంద్రం రేపు పార్లమెంటులో బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలకు మంత్రివర్గం శుక్రవారం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
National: ఢిల్లీలో గత కొద్దిరోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో పార్లమెంటు నూతన భవనం కూడా చిక్కుకుపోయింది. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం వరద నీటిలో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికి భవనంలోపలికి వర్షపు నీరు వచ్చి చేరి ఇబ్బందికరంగా మారిపోయింది.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఎస్సీ వర్గీకరణ గురించి ప్రకటన చేశారని గుర్తు చేశారు.
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్త పార్లమెంటు భవనం పైకప్పు లీకవుతోంది. రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనం లాబీలోని గాజు పైకప్పు నుంచి కింద ఉచిన బకెట్లోకి నీరు ధారగా పడుతున్న వీడియోను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్...
దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు.
ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖడ్ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.
మండీ నియోజకవర్గ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంటులో గురువారం తొలిసారిగా ప్రసంగించారు. తన నియోజకవర్గంలో, రాష్ట్రంలో అంతరించిపోతున్న కళారూపాలపై ఆవేదనా భరితప్రసంగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె నెట్టింట పంచుకున్నారు.
న్యూఢిల్లీ: విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులపై పార్లమెంట్లో మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలసౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు... విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2020 జూన్లో ప్రారంభమయ్యాయని, మొత్తం రూ. 611 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టారన్నారు.
గాంధీ, బచ్చన్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒకరికొరు తారస పడితే అక్కడ సహజంగానే ఒకింత ఆసక్తికర వాతవారణం నెలకొంటుంది. అలాంటి అరుదైన ఘటనే బుధవారంనాడు పార్లమెంటు ఆవరణలో చేటుచేసుకుంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఒకరికొకరు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.
పండించిన పంటలపై కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతులు చిరకాల డిమాండ్ ఊపందుకోనుంది. దీనిపై విపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ నేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం బుధవారంనాడు కలుసుకుంది.