Home » Parliament Special Session
కొత్త పార్లమెంటు భవనానికి తరలి వెళ్లినా పాత పార్లమెంటు భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సెషన్ చారిత్రాత్మకమైనదని అన్నారు. తాము కొత్త భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఒక చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ సమయం తక్కువగానే ఉండొచ్చు కానీ చరిత్రాత్మకం కాబోతుందని వ్యాఖ్యానించారు. అనేక కారణాల వల్ల చాలా చరిత్రలో నిలవబోతోందన్నారు.