Home » Parliament Special Session
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుపై చర్చ జరగనుంది.
పార్లమెంట్ సమావేశాల్లో మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం లోక్సభ సీట్ల పెంపుపైనే ఆసక్తి కనబరుస్తోందని ఆమె విమర్శించారు.
పార్లమెంట్ వేదికగా డీలిమిటేషన్ బిల్లుపై ప్రసంగించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారంటూ అసభ్య పదజాలం వాడుతూ ఘాటుగా విమర్శించారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగించారు. కేవలం మౌలిక వసతుల కల్పనే వికసిత్ భారత్ కాదని.. మహిళలకూ అధికారం ఇవ్వాలని ఆయన అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు టీఎంసీ ఎంపీలు గైర్హాజరవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఎంపీలంతా హాజరై కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని ఆయన కోరారు.
మహిళా రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్ బిల్లులకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. డీలిమిటేషన్ ద్వారా మహిళా రిజర్వేషన్ అమలను తాము వ్యతిరేకిస్తున్నామని అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై తమ పార్టీ అభిప్రాయాన్ని ముందే స్పష్టం చేశామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. ఈ విషయంలో కొత్తగా తాను చెప్పాల్సిందేమీ లేదని తెలిపారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఈ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్యగా అభివర్ణించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మృతిచెందిన పలువురు ప్రముఖులకు లోక్సభలో నివాళులర్పించారు. అనంతరం ప్రధాన బిల్లుపై చర్చ మొదలైంది.
పార్లమెంట్లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నారని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.