Home » Parliament Budget Session
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్పై నిప్పులు కక్కారు. విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలపై పవర్ఫుల్ పంచ్ విసిరారు. ''దేశాన్ని దోచుకున్న వారు మూల్యం చెల్లించాల్సిందే'' అని హెచ్చరించారు.
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మూడో టర్మ్లోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా సరసన భారత్ను నిలిపే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, మూడో స్థానంలోకి తీసుకువెళ్లడం తమ విజన్ అని స్పష్టం చేశారు.
PM Narendra Modi: విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయని.. అందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం జరగనున్న ఈ ప్రసంగంలో మోదీ ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Drowpadi Murmu) ఇరు సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.
వికసిత భారతావనిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనుండగా ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం. నూతన పార్లమెంట్ భవనంలో ఇవే మొదటి సమావేశాలు కావడం గమనార్హం.
శీతాకాల సమావేశాల సమయంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో.. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ‘పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్’ అంశంపై ప్రశ్నించినందుకు, దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేసినందుకు.. ఆ ఎంపీలపై వేటు వేయడం జరిగింది.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం 11.30 గంటలకు సమావేశానికి హాజరుకావాలని లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పార్టీల నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.
Telangana: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు(శుక్రవారం) ఉదయం 11గంటలకు జరుగనుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగనున్న ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు హాజరుకానున్నారు.