Home » Paper Leakage
‘నీట్’ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా లోపాలున్నాయని థర్డ్ పార్టీ రివ్యూలో తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4 వేల కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'నీట్' ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తొలిసారి పెదవి విప్పారు. ఈ కేసులో తనను ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు.
‘నీట్’ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని, కేంద్రం స్పందించేలా ఒత్తిడి చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డికి విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ బహిరంగ లేఖ రాసింది.
నీట్ పేపర్ లీక్ అయ్యింది! ‘‘అబ్బే.. నీట్లో ఎలాంటి అక్రమాలూ జరగలేదు, పేపర్ లీక్ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు’’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు.
నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతూ 20 మంది అభ్యర్థులు దాఖలుచేసిన పిటిషన్లపైన, నీట్ అక్రమాలపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్పైన..
యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం లీకైనట్లు తేలిపోయింది. దేశవ్యాప్తంగా మంగళవారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగ్గా..సోమవారమే ప్రశ్నపత్రాలు డార్క్వెబ్లో అందుబాటులోకి వచ్చాయి.
ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలను ఆపినట్లుగా చెప్పుకొనే మోదీ.. పేపర్ లీక్ను అడ్డుకోలేకపోయారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage) వ్యవహారంపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి(Central Education Minister) ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
నీట్ పరీక్షల్లో అవకతవకలపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీట్ పేపర్ వివాదంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. కేంద్రప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్(NEET Paper Leak) కావడం కలకలం సృష్టిస్తు్న్న వేళ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ ఆనంద్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.