Home » Palnadu
పల్నాడు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం, అందుగుల కొత్తపాలెం, సమీపంలో గురువారం తెల్లారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది.
నరసరావుపేట(Narasaraopet)లో జిల్లా వైసీపీ కార్యాలయానికి(YSRCP Office) అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Former MLA Gopireddy Srinivasa Reddy) మండిపడ్డారు. 2014- 2019మధ్య టీడీపీ ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో జీవో నంబర్ 27తెచ్చి టీడీపీ ఆఫీసుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గోపిరెడ్డి ఆరోపించారు.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం, కంటేపూడి దగ్గర ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో క్లీనర్ మణికంఠ (24) మృతి చెందగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.
జిల్లాలో పరిస్థితి క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. పిన్నెల్లి వ్యవహారంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా పలు కేసుల్లో నిందితుడైన మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి..
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో జూన్ 4న ఓట్ల కౌంటింగ్(Counting of Votes) సందర్భంగా జిల్లా పోలీసులు(Palnadu Police) అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.
ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. విధ్వంసాలను అరికట్టడంలో విఫలమైన ఆ శాఖకు ఓట్ల లెక్కింపు ఓ సవాల్గా మారింది. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం నుంచి జిల్లా అంతటా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.