Home » Palnadu
అంబటి రాంబాబు ఒంటెద్గు పోకడపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గంలో అంబటి అనుచరుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి మండలం ధరణికోటలో టీడీపీ కార్యకర్త సంజయ్పై వైసిపి దాడిని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు.
ఖాసీం ముందుగా తన కొడుకు జాకీర్ను వెంట పెట్టుకుని రెహ్మాన్ను సత్తెనపల్లి శివారులో గొంతు నులిమి చంపేశారు. అనంతరం ధూళ్లిపాళ్ల గ్రామానికి వెళ్లి రహీమూన్, మాలింబిని బలమైన ఆయుధంతో కొట్టి హత మార్చారు. అనంతరం స్కూటీలో కొడుకు జాకీర్తో కలిసి ఖాసీం పరారయ్యాడు.
జిల్లాలోని నరసరావుపేట మండలం పమిడిమర్రు వద్ద స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నపొలాల్లోకి దూసుకెళ్లింది.
పల్నాడు జిల్లా: సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను ప్రజలకు చూపించటానికే బస్సు యాత్ర చేపట్టామని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
రాష్ట్రంలో 7 వేల మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 4వేల మంది టీచర్లను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన వారిని కూడా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేని స్కూళ్లకు పంపించడానికి
జగన్ను పారదోలే సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం దాచేపల్లి మండలం తంగెడలో రచ్చబండ - ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో యరపతినేని పాల్గొన్నారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్లలో పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులను యరపతినేని వివరించారు.
బాపట్లలో 15ఏళ్ల బాలుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటనపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. పొద్దున్నే కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవదహనాలు జరుగుతున్నాయని తెలిపారు.
జూదంలేని రాష్ట్రంగా చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఈరోజు ఒలింపిక్స్లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని యెద్దేవా చేశారు. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ క్లబ్లను మాత్రం మూసేశారన్నారు.
నాలుగేళ్ల వైసీపీ పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. విద్యా ప్రమాణాలు పడిపోయి దేశంలోనే 19వ స్థానంలో నిలవడం సిగ్గుచేటన్నారు. మాతృభాషకు తూట్లు పొడిచారని... భావితరాలకు తీరని అన్యాయం చేశారని అన్నారు.