Home » Palnadu
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి మండిపడ్డారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. పావలా వడ్డీని కూడా పట్టించుకోలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల వేళ.. అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అధికార వైసీపీ వల్ల బాధిత కుటుంబాలుగా మారిన టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని రెసిడెంట్లు.. కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం, డీజీపీ, పల్నాడు ఎస్పీలను ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.
ఐదేళ్ల వైసీపీ పాలనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడును రావణకాష్టంగా మార్చారని గురజాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasa Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి నుంచి పల్నాడుకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేశారని మండిపడ్డారు.
Andhraprdesh: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తూ.. జగన్ను ఏకిపారేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రికి ప్రచారం చేసే అర్హత లేదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పల్నాడులో ఓటు అడిగే హక్కు జగన్కు లేదన్నారు. హత్యలకు అడ్డంగా పల్నాడు మారిందని.. జగన్ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు.
Andhrapradesh: పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయం దగ్ధంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ రౌడీ మూకలే టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అధికారాన్ని కోల్పోవడం ఖాయం అని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదని.. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీగౌతమ్ స్కూల్ యాజమాన్యం మొద్దు నిద్ర వల్లే తమ బిడ్డలు మరణించారని తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఆ క్రమంలో శ్రీగౌతమ్ స్కూల్ను ధ్వంసం చేశారు. అయితే వారిని అడ్డుకోబోయిన పోలీసులపైనే కాకుండా.. పోలీసుల వాహనంపై కూడా వారు దాడి చేసి.. ధ్వంసం చేశారు.
అమరావతి: కారంపూడి సీఐ చిన్న మల్లయ్యపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైర్ అయ్యారు. వైసీపీ ప్యాకేజీ మత్తులో సీఐకు తెలియడంలేదు కానీ.. సీఎం జగ్గూభాయ్ సీను ఎప్పుడో కాలిపోయిందని అన్నారు.
Andhrapradesh: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ మొత్తానికి తాడేపల్లికి చేరింది. చిలకలూరి పేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడుకు సీఎంవో నుంచి పిలుపు వెళ్లడంతో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇంచార్జి పదవి నుంచి మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును వైసీపీ నియమించింది.
Andhra Pradesh News: టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన ముఖ్యనేత గుంటుపల్లి నాగేశ్వరరావు(Guntupalli Nageswara Rao) కన్నూమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు(Palnadu) జిల్లాకు చెందిన బీసీ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు టీడీపీ(TDP)లో చాలా కీలకంగా ఉన్నారు.