Home » Osmania university
నిర్ణీత గడువులోగా బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేక మరోసారి రీఅడ్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దిగులుపడుతున్న పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు శుభవార్త.
గ్రూప్-2(Group-2) పోస్టులు పెంచాలని, డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల(OU Arts College) ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా అరకొర నోటిఫికేషన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్లోనూ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించారు.
నీట్, నెట్ ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు, యూనివర్సిటీల్లో ఆందోళనలు నిర్వహించాయి. నీట్ పరీక్షను రద్దు చేసి.. తిరిగి నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.
కార్పొరేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై ఓయూ విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సీఎం నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.
‘ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా? రేపు ఓ బిచ్చగాడు వచ్చి భిక్షాటనే నా ఆదాయం. కానీ, రోడ్డును ఆక్రమించానని ఖాళీ చేయమంటున్నారు. దీనికి ముఖ్యమంత్రే బాధ్యులు అంటే ఏం చేస్తారు?’ అని హైకోర్టు ప్రశ్నించింది.
ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సదుపాయాలు, నాణ్యమైన వైద్యం అందాలంటే వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారం (21వ తేదీ)తో ముగియనుంది. కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్చార్జి వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ (BRS) సోషల్ మీడియా ఇన్చార్జ్ క్రిశాంక్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతన్ని చంచల్ గూడ జైలు నుంచి ఓయూ పోలీసులు ఈరోజు(ఆదివారం) కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మొదటగా ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్కి క్రిశాంక్ను పోలీసులు తరలించారు.
ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేయడం