Home » Operation Sindoor
Jaishankar On India Pakistan Ceasefire: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం కృషి చేసింది మేమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మా వల్లే.. అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. తాజాగా కాల్పుల విరమణకు సహకరించిన అమెరికాకు థ్యాంక్స్ చెప్తారా? అని అంతర్జాతీయ మీడియా ప్రశ్నించగా.. భారత విదేశాంగమంత్రి జై శంకర్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.
Shashi Tharoor on Operation Sindoor: అఖిలపక్ష ప్రతినిధి బృందంతో పాటు గయానా చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' పాక్ ఉగ్రవాదులు సృష్టించిన హింసకు ప్రతిస్పందన అని.. యుద్ధం కాదని అన్నారు. ఇంకోసారి భారత్ జోలికొస్తే రియాక్షన్ మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిందని, భారత్ గణనీయమని ఆర్థిక ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. పాక్ పరిస్థితి ఏమిటని నిలదీశారు. జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, పాకిస్థాన్ ఎక్కడ ఉందో ఆలోచించుకోవాలని అన్నారు.
ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్మెన్లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని చెప్పారు.
మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు (PIOs) చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. పీఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకుంటున్నట్టు కూడా గుర్తించామని పేర్కొంది.
Venkaiah Naidu:పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని వెంకయ్య నాయుడు అన్నారు.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించేందుకు ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు మాస్కోలో ల్యాండ్ అవుతున్న సమయంలో వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది.
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.
పహల్గాం దాడి సందర్భంలో బాధిత మహిళలు అనుసరించాల్సిన తీరుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు ఎంపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.