Home » Operation Sindoor
సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించిన ప్రధాని.. ఉగ్రమూకలకు భారత్ గట్టిగా జవాబిచ్చిందని అన్నారు.
పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద దురాగతాలకి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పాక్ చేస్తున్న దుర్మార్గపు చర్యల్ని రియాద్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు కళ్లకు కట్టినట్టు చప్పే ప్రయత్నం చేశారు అసద్.
భారత్ వైమానికి దాడుల తర్వాత గత మంగళవారంనాడు మాక్సర్ టెక్నాలజీస్ తీసిన ఉహగ్రహ చిత్రాలు పాకిస్తాన్లోని పలు ఎయిర్ బేస్లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వెల్లడించాయి. వీటిలో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదాలోని పీఏఎఫ్ బేస్ ముషాఫ్, భొలారి ఎయిర్ బేస్, జకోబాబాద్లోని పీఏఫ్ బేస్ షెహబాజ్ ఉన్నాయి.
Operation Sindoor: మాక్ డ్రిల్స్ మళ్లీ మొదలవ్వనున్నాయి. గురువారం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నాలుగు జిల్లాల్లో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్లలో అధికారులు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.
ప్రొఫెసర్ అలీఖాన్ భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రసంగంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే కేసు నమోదైనందున ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఎలాంటి పోస్టులు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.
భారత సాయుధ బలగాలు పాకిస్థాన్లోని 2.2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపడం, అత్యంత శక్తివంతంగా దాడులు జరగడంతో పాకిస్థాన్ రేంజర్లు కకావికలై పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ హీరోలను సత్కరించేందుకు బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, పహల్గాం ఉగ్రదాడి వెనుక ఎవరున్నా వారిని అంతమొందిస్తామని అమిత్షా చెప్పారు. ముష్కరులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడాన్ని గుర్తుచేశారు.
Asaduddin Owaisi Slams Pakistan: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ఫొటోను బహూకరించారు. ఆ చిత్రం ఇటీవల భారతదేశంపై పాకిస్థాన్ జరిపిన దాడికి సంబంధించినదని పేర్కొన్నారు. కానీ ఆ ఫోటో 2019 కి సంబంధించినది. దీంతో దాయాది దేశానికి తనదైన స్టైల్లో మరోమారు చురకలంటించారు AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.