Home » Ongole
భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చినాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగుతేజం మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఎస్ఎన్పాడు నియోజకవర్గంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని (ఐఐఎస్సీ)లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుపై మద్యం సేవించి మందుబాబులు దాడి చేసి, అతనికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి, దుండగులు పరారయ్యారు.
ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లై ఓవర్ సమీపంలో 10 నిమిషాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
Road Accidents in AP: ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆయా ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ తెలిపింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఆయన ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఒంగోలులో 36వ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర మహాసభలు మే మొదటి వారంలో నిర్వహించేందుకు నిర్ణయం. 300 మంది ప్రతినిధులు పాల్గొంటారు, ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించనున్నారు
Prabhavati Investigation: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ నిమిత్తం ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే కాసేపటికే ప్రభావతి తిరిగి వెళ్లిపోయారు.
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్ నాయక్కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.