Home » Om Birla
లోక్సభలో మొదటిసారిగా జనసేన పార్టీ ఎంపీలు అడుగుపెట్టారు. ఆ పార్టీ తరపున లోక్సభకు ఇద్దరు పోటీచేసి గెలిచారు. పొత్తులో భాగంగా ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి.
పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా బుధవారంనాడు ఎన్నికైన ఓం బిర్లా తొలి ప్రసంగంలోనే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
లోక్సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి 18వ లోక్సభలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు.
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా(Om Birla) మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్గా ఎన్నికవ్వడం వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా ఓం బిర్లాను ప్రధాని మోదీ(PM Modi), లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకొచ్చారు.
18వ లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా(Om Birla) వాయిస్ ఓటు ద్వారా ఎన్నికయ్యారు. బుధవారం (జూన్ 26, 2024) జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్కు చెందిన కోడికున్నిల్ సురేష్ (కె సురేశ్)పై విజయం సాధించారు. అయితే మళ్లీ ప్రధాని మోదీ ఎందుకు ఓం బిర్లాను ఎంచుకున్నారు. ఆయన నేపథ్యం, ఫ్యామిలీ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అధికారం కోల్పోయి... అనుకున్నవేవీ జరగక... దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల శరణుజొచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..
దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి పోటీ జరగబోతోంది. అధికార ఎన్డీయే తరఫున మరోసారి ఓం బిర్లా బరిలో నిలవగా.. విపక్ష ఇండియా కూటమి సైతం కేరళకు చెందిన కొడికున్నిల్ సురేష్ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది.
లోక్ సభ స్పీకర్ పదవికి(Lok Sabha Speaker Post) ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, ఎన్డీయే కూటమికి విపక్ష కాంగ్రెస్(Congress) భారీ షాక్ ఇచ్చింది. సంఖ్యా బలం తక్కువున్నా.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపింది.