Home » Om Birla
Andhrapradesh: కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామ్మోహన్ టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. మూడు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టకు భంగం కలిగేంచేలా సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్ట్లను తొలగించాలని ఎక్స్ కార్పొరేషన్తోపాటు గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. 16 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆగస్ట్ 12వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తారు.
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్ రాఠీ పేరిట ఉన్న ఓ పేరడీ ‘ఎక్స్’ ఖాతా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కుమార్తెకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్టు చేసిన నేపథ్యంలో..
రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు లోక్సభలో సమాధానమిస్తుండగా సభలో గలభా చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మందలించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదులు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు చేసిన ఒక ప్రస్తావనకు సభాపతి ఓం బిర్లా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పెద్దలను గౌరవించడమనే సంస్కృతిని తాను పాటించినట్టు చెప్పారు.
రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి కేసు ఘటనలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్కు సమన్లు జారీ చేశారు. గత రాత్రి ఒవైసీ నివాసంపై ఆగంతకులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఒవైసీ వివరించారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీపీ (Telugu Desam Parliamentary Party) నేతల వివరాలను లేఖ ద్వారా స్పీకర్కు తెలిపారు. లావు శ్రీకృష్ణ దేవరాయలును టీడీపీపీ నేతగా గుర్తించాలని కోరారు.