Home » Om Birla
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో బుధవారంనాడు వీగిపోయింది. విపక్ష ఎంపీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని తొలి దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను ప్యానల్ స్పీకర్ జగదంబిక పాల్ చేపట్టారు.
పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే..
పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఈ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
నేటి నుంచి పార్లమెంట్ రెండో దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందా? లేక వీగిపోతుందా? సభలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలెలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం...
పార్లమెంటులో ఇటీవల విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీని సభకు రావొద్దొని సూచించినట్టు స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్లోకి దూసుకెళ్లి ఆయన నిందించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్సభ సెక్రటరీకి అందజేశారు.
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పీకర్ ఇచ్చిన టీపార్టీలో పాల్గొన్నారు. విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు.
గురువారం జరిగిన లోక్సభ సమావేశాల్లో ఈ-సిగరెట్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఓ టీఎంసీ ఎంపీ.. సభలో ఈ-సిగరెట్ తాగారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లేవనెత్తారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు.
మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఉద్ఘాటించారు. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించగలమని ఓంబిర్లా పేర్కొన్నారు.