Home » Odisha
పోలీసులు క్రియేటివిటీకి నెటిజన్ల పొట్ట చెక్కలవుతోంది. వీరు పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..
దానా తుపాన్ గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఒడిశాకు తుపాన్ తాకిడి అధికం. ఎప్పుడు తుపాన్ వచ్చిన.. తక్కువ ప్రాణ, ఆస్తి నష్టం ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. తుపాన్ వచ్చిందంటే చాలు.. అంతకు ముందే ఒడిశా అప్రమత్తమవుతుంది. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది.
కర్ణాటకలో మహాలక్ష్మి అనే మహిళను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచిన ఘటనలో నిందితుడు ముక్తిరంజన్ ఒడిశాలోని తన స్వగ్రామంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషనుకు వెళితే పోలీసులు అరెస్టు చేసి, తనపై దాడి చేసి, లైంగికంగా వేధించారని ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ సైనికాధికారి స్నేహితురాలు వాపోయింది.
ఆయిల్ ట్యాంకర్ ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది(accident). దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న టీ స్టాల్పై నుంచి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
కల్తీ మద్యం తాగి.. 14 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒడిశాలో చికితా ప్రాంతంలోని మౌండ్పూర్ గ్రామంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగిన అనంతరం వీరంతా వాంతులు చేసుకోవడంతో.. స్థానికులు వెంటనే స్పందించారు. ఆ క్రమంలో వారిని చికితాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు.
పంద్రాగస్టు వేడుకల వేళ ఒడిశాలోని(Odisha) బీజేపీ సర్కార్ వనితలకు శుభవార్త చెప్పింది. మహిళా ఉద్యోగుల కోసం ఒక రోజు నెలసరి సెలవు (Menstrual Leave) పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్గిరి-పాండురంగాపురం రైల్వే లైన్తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
దేశంలోనే మొట్టమొదటి ’రైస్ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్లోని మంచేశ్వర్లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు.
ఒడిశాలోని ఐఎన్ఎస్ చిలుకలో అగ్నివీర్ నాల్గవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదటి మూడు బ్యాచ్ల్లో 2,500 మంది శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారని తెలిపారు. 2022లో అగ్నివీర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.