Home » Odisha
ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024లో మహిళల వాల్ట్ ఈవెంట్లో ప్రముఖ క్రీడాకారిణి దీపా కర్మాకర్(Dipa Karmakar) మహిళల ఆల్రౌండ్ విభాగంలో బంగారు పతకం గెల్చుకున్నారు.
దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల(Road Accidents) సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల్లో కుటుంబ పెద్దలను కోల్పోతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. హెవీ ట్రక్కులు, లారీలతో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.
Newborn Girl Stuck in Abandoned Bore Well in Odisha: ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాడుబడ్డ బోరుబావిలో నవజాతశిశువు కనిపించడం కలకలం సృష్టించింది. 20 అడుగుల లోతులో ఉన్న శిశువును రెస్క్యూ సిబ్బంది ఐదున్నర గంటల పాటు కష్టపడి అతికష్టం మీద ప్రాణాలతో కాపాడారు.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో(IT Raids) నోట్ల గుట్టలు బయటపడుతన్నాయి. ఒడిశా, జార్ఖండ్ లలోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని 'ఎక్స్' వేదికపై మోదీ శుక్రవారంనాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తన ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుతో సంబంధం ఉన్న ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి కోట్లాది రూపాయల నగదు ఐటీ దాడుల్లో పట్టుబడింది.
ఒడిశాలోని పారాదీప్ పోర్ట్లో లంగరు వేసిన ఇండోనేషియా కార్గో షిప్లో రూ.220 కోట్లు విలువచేసే కొకైన్ పట్టుబడింది. ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈ కొకైన్ పట్టుబడింది.
ఒకే ఒక్క ఘటనతో ఆ ఊరు ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ రాత్రవుతున్నా తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి రాత్రంతా వెతికారు. అయినా ఆమె జాడమాత్రం కనిపించలేదు. మరసటి రోజు...
దంపతుల మధ్య తలెత్తే గొడవలు చాలా వరకు త్వరగా సర్దుమణుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ గొడవలు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...
ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు.